పట్టపగలే దారుణం…. పింఛన్‌ పంపిణి సొమ్ము చోరీ

పట్టపగలే దారుణం.... పింఛన్‌ పంపిణి సొమ్ము చోరీ
Horrible robbery in Anakapally in daylight(Representational Image)

అనకాపల్లిలో పట్టపగలే భయంకరమైన చోరీ జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు, అధికారులు అప్రమత్తమయ్యారు. పింఛన్‌ సొమ్ము పంపిణీకి భారీగా నగదును తరలిస్తూ నక్కపల్లి నుంచి రాజయ్యపేటకు స్కూటర్‌పై వెళ్తున్న సంక్షేమ సహాయకుడు, డిజిటల్‌ అసిస్టెంట్‌పై ఇద్దరు దుండగులు దాడి చేశారు.

హెటెరో రోడ్డులో ఈ సంఘటన జరిగింది. దుండగులు పెప్పర్ స్ప్రేని ఉపయోగించి 13 లక్షల నగదుతో పరారయ్యారు. బాధితులు సమీపంలోని బ్యాంకు నుండి పెద్ద మొత్తంలో నగదు తీసుకొని అర్హులైన వ్యక్తులకు పింఛను పంపిణీ చేయడానికి వెళ్తున్న సమయంలో, మార్గమద్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సంఘటనతో భయాందోళనకు గురైనప్పటికీ, బాధితులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై అనకాపల్లి పోలీసు అధికారులు వెంటనే నివేదిక నమోదు చేసి విస్తృత దర్యాప్తు చేపట్టారు.