దివ్య భర్త దొరికాడు.. కేసులో కొత్త ట్విస్ట్ లు ..!

ప్రాణం తీసిన ప్రేమ

ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో దివ్య హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అతి దారుణంగా హత్య చేయబడ్డ వైజాగ్ దివ్య హత్య కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఆమెను భయటి వారే కాకుండా సొంత కుటుంబ సభ్యులు కూడా చిత్ర హింసలకు గురి చేశారని విచారణలో కొత్త నిజాలు వెలుగు చూస్తున్నాయి.

అయితే తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెంలో పేద కుటుంబంలో పుట్టిన దివ్య చిన్న వయసులోనే తల్లి, తమ్ముడు, అమ్మమ్మ హత్యకు గురయ్యారు. దాంతో విశాఖ నగరంలోని ఎన్‌ఏడీ కూడలి వద్ద ఉంటున్న గీత వద్దకు చేరింది. దివ్య అందాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని గీత మాయమాటలతో వ్యభిచార కూపంలోకి దింపింది. అయితే కొద్ది నెలల తర్వాత అక్కడి నుంచి దివ్య పారిపోయి సొంతూరు చేసుకుంది. అక్కడ ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన వీరుబాబుతో బంధువులు పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత వీరబాబు దివ్యను చిత్ర హింసలకు గురి చేసేవాడు. దీంతో మళ్లీ దివ్యను తీసుకువచ్చి గీతకు అప్పగించాడు. అక్కడ కొన్ని రోజుల పాటు ఉన్న దివ్య తర్వాత అక్కయ్యపాలెంలోని వసంత అలియాస్‌ జ్యోతి వద్దకు చేరింది. అక్కడ వారికి వాటాల్లో గొడవ జరగటంతో జ్యోతి… దివ్యను చిత్ర హింసలకు గురి చేసింది. ఆరు రోజులపాటు తిండి పెట్టకుండా నానారకాలుగా కుల్లపొడిచింది. ఆ తర్వాత హత్య చేసింది. ఈ కేసులో ప్రస్తుతం పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అలాగే.. మిగతా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలింపులు చేపట్టారు.