రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన

రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన

రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యని కిరాతకంగా చంపేశాడో కసాయి భర్త. కసితీరా 12 కత్తిపోట్లు పొడిచి హతమార్చాడు. ఫరూక్‌నగర్ మండలం అన్నారం పంచాయతీ పరిధిలోని గుండెతండాలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన రమేష్ తన భార్య లలితని అత్యంత దారుణంగా చంపేశాడు.

లలిత ఒంటిపై 12 సార్లు కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. హత్యకు కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.