భార్య భర్తల మృతి

భార్య భర్తల మృతి

కరోనాతో బాధపడుతూ భర్త.. గుండెపోటుతో భార్య మృతి చెందింది. ఈ సంఘటన భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన డి.యాదగిరిరెడ్డి (76) కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. అతని భార్య భారతమ్మ (66)కు గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో భర్త మరణించిన విషయం తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడ్డారు. అయితే.. మంగళవారం అర్ధరాత్రి ఆమె గుండెపోటుతో మృతి చెందింది. ఒక్కరోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో విషాదం నెలకొంది.