అతడే అత్య‌త్తుమ ఫినిషర్

అతడే అత్య‌త్తుమ ఫినిషర్

చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనిపై టీమిండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఐపీఎల్‌లో అంద‌రికంటే ఎంఎస్ ధోని అత్య‌త్తుమ ఫినిష‌ర్ అని పఠాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌ను ధోని త‌న‌దైన స్టైల్లో ఫినిష్ చేసిన సంగ‌తి తెలిసిందే. “ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోని అత్య‌త్తుమ‌ ఫినిషర్. ధోని ఐపీఎల్ నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత మరొకరు ఈ జాబితాలోకి చేర‌వ‌చ్చు. కానీ ధోని లాంటి గ్రేట్ ఫినిష‌ర్‌లు రారు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ధోని, డివిలియర్స్ అద్భుత‌మైన ఫినిష‌ర్‌లు.

కానీ ధోనీ ముందంజలో ఉన్నాడు. ఇక సీఎస్‌కే జ‌ట్టు గురించి మాట్లాడూతూ.. చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ఏ జ‌ట్టు త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌దు. ఎందుకంటే చాలాసార్లు ఓట‌మి అంచుల నుంచి విజయ తీరాలకు చేరుకుంది. లీగ్ చ‌రిత్ర‌లో సీఎస్‌కే అత్యంత ప్రమాదకరమైన జ‌ట్టు” అని ఇర్ఫాన్ ప‌ఠాన్ పేర్కొన్నాడు. ఇక ప్ర‌స్తుత సీజ‌న్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే.. రెండు మ్యాచ్‌లో విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో ఉంది. కాగా సోమ‌వారం పంజాబ్ కింగ్స్‌తో సీఎస్‌కే త‌ల‌ప‌డ‌నుంది.