హనుమ విహారి చోటు దక్కలేదు

హనుమ విహారి చోటు దక్కలేదు

కాగా ప్రస్తుతం అజింక్య రహానె టెస్టుల్లో ప్రస్తుతం పేలవ ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. అయితే అతడికి విదేశాల్లో ఉన్న రికార్డుల దృష్ట్యా.. తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మరో వైపు ఆరంగ్రేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్‌కు మిడిలార్డర్‌లో చోటు దక్కచ్చు. ఇక మరోసారి హనుమ విహారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తుది జట్టులో ఎవరకి చోటుదక్కుతుందో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో క్రికెట్‌ నిపుణలు, మాజీలు దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్‌​కు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను అంచనా వేస్తున్నారు. ఈ కోవలో భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ కూడా చేరాడు. తొలి టెస్ట్‌​కు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను జాఫర్ ఎంచుకున్నాడు.

ఈ జట్టులో మయాంక్ అగర్వాల్, కేఎల్‌ రాహుల్‌ను ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. ఇక ఫామ్‌లో లేకపోయిన ఛెతేశ్వర్ పుజారాకు తన జట్టులో మూడో స్ధానంలో చోటు కల్పించాడు. ఇక నాలుగో స్ధానంలో కెప్టెన్‌ కోహ్లికు చోటు దక్కింది. ఇక ఐదో స్ధానంలో అతడు అజింక్యా రహానె వైపే మెగ్గుచూపాడు. ఆరో స్ధానంలో శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపిక చేశాడు. ఇక జట్టు వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌కు చోటు ఇచ్చాడు. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎంచుకున్నాడు. ఇక బౌలర్ల కోటాలో మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా,మహ్మద్‌ సిరాజ్‌కు వసీం చోటు ఇచ్చాడు. కాగా జాఫర్ ప్రకటించిన జట్టులో హనుమ విహారి చోటు దక్కలేదు.