ఎంపీ రఘురామకృష్ణం రాజుపై జగన్ ఆగ్రహం

ఎంపీ రఘురామకృష్ణం రాజుపై జగన్ ఆగ్రహం

తాజాగా పార్లమెంటు లో ఏపీలో ఇంగ్లీష్ మీడియం చదువులపై దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే కదా. టీడీపీ ఎంపీ కేశినేని దీన్ని లేవనెత్తడం ఆంధ్రాలోతెలుగు భాషను బతికించాలంటూ కేంద్రాన్ని కోరడం పై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. వైసీపీ ఎంపీలు కేశినేని ప్రసంగించిన వాక్యాలను అడ్డగించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మాట్లాడిన వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రాంగ్ స్టెప్ వేయడం జరిగింది. అదే ఇప్పుడు తెలుగుదేశం పాలిట అస్త్రంగా మారింది.

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంట్ లో ‘ఇంగ్లీష్ మీడియం’ చదువుల పై చర్చ సందర్భంగా మాట్లాడే అవకాశం లభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వైసీపీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా లైన్ తీసుకొని మాట్లాడడం పార్టీలో బాగా కలకలం రేపింది అంటే నమ్మండి. రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఇలా అన్నాడు, తెలుగు భాష ఉన్నతికి కేంద్రం సహకరించాలని ఆయన అనడం వైసీపీ తోటి ఎంపీలను సైతం ఆశ్చర్యపరిచింది. కానీ రఘురామకృష్ణంరాజు తెలిసి అన్నాడో ఫ్లోలో అన్నాడో తెలియదు కానీ టీడీపీ కి మాత్రం బాగా అస్త్రం అయ్యింది. జగన్ పార్టీ ఎంపీలు తెలుగు భాష ఉన్నతికి కోరుతుంటే జగన్ మాత్రం సమాధి చేస్తున్నాడంటూ టీడీపీ నేతలు విమర్శలు చేయడం ప్రారంభించారు.

ఇక ఈ వివాదం రాజు పై సీఎం జగన్ సీరియస్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం కూడా కొనసాగుతుంది. పేదల కోసం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం చదువుల కు వ్యతిరేకంగా ఏ ఎంపీ మాట్లాడినా పార్టీ పరంగా చర్యలు తప్పవని రఘురామకృష్ణం రాజును జగన్ హెచ్చరించినట్లుగా అస్త్రం అయ్యింది . రఘురామకృష్ణం రాజు నుంచి వివరణ తీసుకోవాలని గోదావరి జిల్లాల పార్టీ ఇన్ చార్జి వైవీ సుబ్బారెడ్డి ని జగన్ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది.