అనుకోని అవాంతరం…నిలిచిపోయిన జగన్ యాత్ర !

Jagan Padayatra was stopped due to heavy rain.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే జగన్ పాదయత్రకి అనుకోని అవాంతరం ఏర్పడింది, దీంతో జగన్ పాదయాత్ర నిలిచిపోయింది. ఈరోజు ఉదయం చింతలపల్లి నుంచి జగన్ 196వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు ఒలింపిక్‌ డే సందర్భంగా ఒలింపిక్‌ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. చింతలపల్లి వద్ద ఒలింపిక్‌ జ్యోతిని వెలిగించారు, అయితే ఈ కార్యక్రమం ముగిసిన కొద్ది సేపటికి చింతలపల్లిలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో భారీ వర్షం కారణంగా జగన్ పాదయాత్రను నిలిపివేశారు. నిన్న శుక్రవారం కోర్టుకు హాజరుయ్యేందుకు జగన్ ఒక రోజు పాదయాత్రకు విరామం ఇచ్చిన జగన్ ఈరోజు ఉదయమే తిరిగి ప్రారంభించారు.