తండ్రి సమాధికోసం కోట్లని ఖర్చు పెడుతున్నాడంటూ వ్యాఖ్యలు

తండ్రి సమాధికోసం కోట్లని ఖర్చు పెడుతున్నాడంటూ వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇది వ్యక్తిగతంగా కాదు, పాలన పరంగా. ముఖ్యమంత్రి అయినప్పటినుండి ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేస్తున్న జగన్, కొన్ని కొన్ని విషయాల్లో టీడీపీ, జనసైనికులకు దొరికిపోతూనే వున్నారు. అయితే తండ్రి సమాధికోసం కొన్ని కోట్లని ఖర్చు పెడుతున్నాడంటూ వ్యాఖ్యలు చేసారు. అయితే తీసుకొనేది రూపాయి జీతం అని చెబుతూనే ఇలాంటి వాటికొరకు ప్రజా ధనం ఖర్చు పెట్టడం వలన కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే గతం లో కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన సొంత ఇంటి పనుల కోసం ప్రజా ధనాన్ని ఖర్చు చేసారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇపుడు జగన్ ఫై ఇలాంటి ఆరోపణలు రావడం మాత్రమే కాకుండా, ఆధారాలతో సహా స్క్రీన్ షాట్లతో సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఫై జనసేన, టీడీపీ పార్టీలు దారుణ విమర్శలు చేసే తరుణం లో ఇలాంటి విషయాలు బయటికి రావడం తో జగన్ ఫై వ్యతిరేకత ఎక్కువ అవుతుంది అని చెప్పాలి.