జేసీ దివాకర్ రెడ్డి సంచలనమైన వాఖ్యలు

జేసీ దివాకర్ రెడ్డి సంచలనమైన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసుల విషయంలో కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా ఇటీవల జేసీ, తాము అధికారంలోకి వస్తే బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అయితే జేసీ దివాకర్ రెడ్డి చేసిన వాఖ్యలపై అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం ఘాటుగా స్పందించారు. జేసీ చేసిన వాఖ్యలు చాలా దారుణమని, తక్షణమే ఆయన పోలీసులందరికి కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా ఈమేరకు జిల్లా పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు సాకే త్రిలోక్ నాథ్, జాఫర్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్ , తేజ్ పాల్, శివకుమార్‌ మాట్లాడుతూ… ఎవరు బూట్లు నాకారనే విషయం మన రాష్ట్ర ప్రజలందరికి తెలుసనీ వాఖ్యానించారు.

ఇకపోతే జేసీ తన వయసు, హోదా అన్ని మరిచి పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నాడని, ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం అనేది చాలా దారుణమని, కనీసం ఇప్పటికైనా కొందరు నేతలు తమ బుద్ధి మార్చుకోవాలని, లేకపోతె చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పోలీసులు హితవు పలికారు. ఇకపోతే ఇప్పటికే జేసీ, పొగరుగా వ్యహరిస్తూ, ఇలా చాలా సార్లు నోరు పారేసుకున్నారని, అందుకు తగిన శిక్ష అనుభవిస్తున్నారని, ఇప్పుడు కూడా అంతకంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రమైన విమర్శలు చేశారు.