అక్క కోసం మూడు రోజులు పాటు ప్రచారం…!

Jr-NTR-To-Campaign-For-TDP-

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూకట్ పల్లి నుంచి బరిలోకి దిగిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి మద్దతుగా కుటుంబం అంతా తరలి వస్తోంది. సుహాసిని గెలుపు కోసం టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో పాటు కుటుంబం సభ్యులు కూడా కష్టపడుతున్నారు. ఆమె బాబాయి, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా సుహాసినితో నామినేషన్ వేయించగా, ఆమె సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ అక్క విజయం సాధించాలని కోరుకుంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. వీరితో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా సుహాసినికి మద్దతు తెలుపుతున్నారు. బాలయ్య కూడా ఆమె తరపున ప్రచార కూడా నిర్వహించనున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ అభిమానులను ఉత్సాహపరిచే శుభవార్త తెలిసింది. ఇప్పుడు జూ.ఎన్టీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారట.

 

Jr NTR To Campaign For TDP Kukatpally Candidate Suhasini

ఏకంగా మూడు రోజుల పాటు ప్రచారం చేయలాని నిర్ణయించుకున్నారని సమాచారం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్‌లో ఉన్నారు. రాజమౌళి సినిమా షూటింగ్ అంటే.. ఇంటికి వెళ్లడం కూడా ఉండదు. సెట్లో ఫిక్సయిపోయినట్లే. పైగా కొత్త సినిమా కోసం ఆయన యూనిట్ మొత్తానికి ఆర్ఎఫ్సిలో ఓ ఇంటిని కూడా కట్టించారు. అందరూ అక్కడే ఉంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇలాంటి సమయంలో… జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొనడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమయింది. ఎన్టీఆర్ ప్రచారం చే్యకపోతే కుటుంబంలో విబేధాలున్నాయని ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశంతో.. అలాంటి అవకాశమే ఇవ్వకూడదన ప్రచారానికి మూడు రోజులు కేటాయించినట్లు సమాచారం. అలాగే సుహాసిని ప్రచారం విషయంలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కొంత మంది ప్రత్యేక శిక్షణ పొందిన ఇంచార్జ్ లను నియమించారు. రాహుల్ గాంధీతో కలిసి.. రోడ్ షో కూడా కూకట్‌పల్లిలో నిర్వహించే అవకాశం ఉంది. అలాగే.. బాలకృష్ణ కూడా విడిగా రోడ్ షో నిర్వహించనున్నారు.

tdp-balayya-sushani