వైసీపీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి !

Key post at the Center for YCP MP!

వైసీపీకి చెందిన మరో ఎంపీకి కేంద్రంలో మరో పదవి దక్కింది. అమలాపురం ఎంపీ చింతా అనురాధకు కోకనట్ బోర్డులో సభ్యురాలిగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ సెక్రటేరియెట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ కోకోనట్‌ బోర్డు కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది.

దేశంలో కొబ్బరి ఉత్పత్తుల అభివృద్దికి, కొబ్బరి సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తుంది. అనురాధకు పదవి దక్కడం శుభపరిణామమనే చెప్పాలి. ఎందుకంటే ఆమె తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుంచి ఎంపీగా గెలిచారు. కొబ్బరి సాగు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది.

అనురాధది కూడా అదే జిల్లా కావడంతో కొబ్బరి రైతుల సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు మంచి అవకాశం దొరికినట్లే. అలాగే కొబ్బరి ఉత్పత్తుల అభివృద్దికి కృషి చేయొచ్చు. కేంద్రంలో మొత్తం నలుగురు వైసీపీ పదవులు దక్కాయి. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ప్యానర్ స్పీకర్‌గా ఉండగా..

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఎస్టిమేట్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇక రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళగిరి ఎయిమ్స్ సభ్యుడిగా ఉన్నారు. తాజాగా అమలాపురం ఎంపీ చింతా అనురాధ కోకోనట్ బోర్డ్ సభ్యురాలిగా నియమించారు.