భారీగానే వసూలు చేస్తున్న కియారా

భారీగానే వసూలు చేస్తున్న కియారా

రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుందని ఇటీవలె చిత్ర బృందం ప్రకటించింది. గతంలో వినయ విధేయ రామలో రామ్‌చరణ్‌తో రొమాన్స్‌ చేసిన కియారానే మరోసారి ఆయనతో జత కట్టనుంది. అయితే ఈ సినిమాకు గాను కియారా రూ. 5 కోట్ల పారితోషికాన్ని డిమాండ్‌ చేసిందట.

కబీర్‌సింగ్‌ విజయంతో స్టార్‌ హీరోయిన్‌ పాపులారిటీ దక్కించుకున్న కియారా ఇప్పుడు రెమ్యునరేషన్‌ విషయంలో భారీగానే వసూలు చేస్తుందట. ఇది వరకు ఒక్కో సినిమాకు 3.5-4 కోట్ల వరకు వసూలు చేసే కియారా ఇప్పుడు మరో కోటి రూపాయలు అదనంగా పెంచేసిందని టాక్‌ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.