గుండె, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న లాలూ మెరుగైన చికిత్స ఢిల్లీకి తరలింపు…

లాలూ ప్రసాద్ యాదవ్ 
లాలూ ప్రసాద్ యాదవ్ 

రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్  ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. దాంతో ఎయిర్ అంబులెన్స్‌లో ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. లాలూతో పాటు వైద్యుల బృందం, అతని పెద్ద కుమార్తె కూడా ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో బెయిల్‌పై బయట ఉన్న లాలూ ఆదివారం ఇంట్లో మెట్లపై నుంచి పడిపోయారు.

ఈ ప్రమాదంలో అతని కుడి భుజం ఫ్రాక్షరైంది.దాంతో లాలూను కుటుంబ సభ్యులు పాట్నాలోని పరాస్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు ఆ ప్రాంతంలో కట్టుకట్టారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు. యాదవ్ ఇప్పటికే షుగర్‌తోపాటు మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యలతో సహా పలు వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ సందర్భంగా లాలూ యాదవ్ ఆరోగ్య స్థితి స్థిరంగా ఉందని అతని కుమారుడు తేజస్వీ యాదవ్ చెప్పారు. మరీ అవసరమైతే చికిత్స కోసం సింగపూర్ తరలిస్తామని వెల్లడించారు.