చిన్నారిని కిడ్నాప్‌ చేసి అఘాయిత్యం

చిన్నారిని కిడ్నాప్‌ చేసి అఘాయిత్యం

మేడ్చల్‌ జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. జవహర్‌నగర్‌ పరిధిలో ఆరేళ్ల బాలికపై కొందరు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. చిన్నారిని కిడ్నాప్‌ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డ కామాంధులు.. ఆమెను ప్రగతినగర్‌ వాటర్‌ ట్యాంక్‌ వద్ద వదలివెళ్లారు.

బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.