లాక్ డౌన్ కామాంధుల క్యాష్.. అమ్మాయి కనిపిస్తే చాలు.. ఎత్తికెళ్లి రేప్

కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో దేశమంతా లాక్ డౌన్ లో కొనసాగుతుంది.  ఇదే సమయంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. అందివచ్చిన అవకాశంగా మలుచుకొని ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లోని ఒక గ్రామంలో 15ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది.
అయితే అసలు ఏం జరిగింది అంటే.. కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో గ్రామస్తులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు. దీంతో రోడ్డులన్నీ ఎడారిగా మారాయి. ఇదే సమయంలో ఒక యువకుడు ఇంట్లో ఉండటానికి విసుగు చెంది బయటకు వెళ్ళాడు.
ఇంతలో.. అతను కిరాణా సామాను తీసుకొని వీథిలో నడుస్తున్న ఒక అమ్మాయిని చూసి బాలు విసిరి.. అది తనకు అందివ్వమని చెప్పాడు. ఆ అమ్మాయి ఆ బాలు తీసుకొని అతని చేతికి అందించింది. అదే అదునుగా భావించిన అతడు ఆ అమ్మాయి చేయి పట్టుకొని.. కత్తితో బెదిరించి ఇంట్లోకి తీసుకుపోయి అత్యాచారం చేశాడు.
ఆ తర్వాత ఆ విషయాన్ని ఎవరితోనైనా చెప్తే… చంపేస్తానని బెదిరించాడు. బాలిక ఏడుస్తూ అక్కడ నుంచి తన ఇంటికి చేరుకొని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వారు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెల్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.