గోప్యంగా పెళ్లాడి.. ఆపై గాయబ్…

తెలంగాణలో ఘోరం చోటుచేసుకుంది. ఓ యువకుడు ప్రేమిస్తున్నానని చెప్పి ఎవరికీ తెలియకుండా గోప్యంగా పెళ్ళాడి ఆ తర్వాత మాయమైపోయాడు. మెదక్ జిల్లాలోని  చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లికి చెందిన చింతాకుల ప్రవీణ అనే యువతి, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. సరే అదే ప్రేమతో పెళ్లి కూడా చేసేసుకున్నాడు.

అయితే వారిద్దరు ప్రేమాయణాన్ని ఏడాదిపాటు ఊర్లోనే సాగించి ఆ తర్వాత యువకుడితో పాటు హైదరాబాద్ వెళ్లిన యువతిని అతడు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిరోజులపాటు హైదరాబాద్ లోనే కాపురం పెట్టారు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. దాంతో అతడు మాత్రలు ఇచ్చి గర్భస్రావం అయ్యేలా చేశాడు. ఈ విషయాంన్ని ప్రవీణ అనే యువతి ఇంట్లో చెప్పింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు గ్రామంలో పంచాయితీ ఏర్పాటు చేసారు. ఈ నెల 14వ తేదీన గ్రామస్థుల సమక్షంలో పంచాయతీ జరిగింది. తీరా ఆ పంచాయితీలో తాను అందరిముందూ తాళి కడతానని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాతే ట్విస్ట్ చోటుచేసుకుంది. తాళి కడతానని చెప్పిన యువకుడు ఆ తర్వాత రోజునుంచి కనిపించకుండా వెళ్లి పోయాడు. దాంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరి ఆ యువతికి ప్రియుడు… తాళి కట్టిన మగడిని పోలీసులు పట్టుకుంటారో లేదో చూడాలి.