పెళ్లి పేరుతో పాస్టర్ మోసం.. కోరిక తీరాక మరొకరితో పెళ్లి.. అరెస్ట్..

తన ప్రేమని నిరాకరించిందని కక్ష పెంచుకున్న యువకుడు

ఆంధ్రప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలో పాస్టర్  దైవసన్నిధిలో పాస్టర్ ఓ యువతితో ప్రేమకలాపాలు సాగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతి ప్రేమకలాపాలు సాగించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ప్రియురాలిపై మోజు తీరాక ముఖం చాటేశాడు. ఎవరికీ తెలియకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చాడు. దీంతో  మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో పాస్టర్ బండారం వెలుగు చూసింది.

జిల్లాలోని పలమనేరు మండలం నెల్లిపట్ల పంచాయతీ పరిధిలోని జంగాల అగ్రహారంలో పాస్టర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. అలా ఆరేళ్ల పాటు ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని లొంగదీసుకొని కోరికలు తీర్చుకున్నాడు. దాంతో ఆమె గర్భం దాల్చిందని తెలియడంతో వెంటనే అబార్షన్ చేయించాడు. తీరా ప్రియురాలిపై మోజు తీరాక ముఖం చాటేశాడు.

కాగా గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టడంతో పాస్టర్ ట్రైనింగ్ పూర్తయ్యాక.. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. తీరా ఇచ్చిన మాటను తుంగలో తొక్కి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయిండంతో విషయం వెలుగు చూసింది. కాగా కీచక పాస్టర్ బాగోతం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బైరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసలు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.