అభిజిత్‌, మోనాల్ ల మధ్య‌ చిగురిస్తున్న ప్రేమ

బిగ్ బాస్ లో చిగురిస్తున్న ప్రేమ జంట

అభిజిత్‌, మోనాల్‌ అర్థరాత్రి ఏకాంతంగా గుసగుసలు పెట్టుకున్నారు. ఇక ఉదయం కూడా మళ్లీ మోనాల్‌, అభిజిత్‌ రహస్యంగా మాట్లాడుకోవడంతో వీరి మధ్య ఎదో ఉందని ప్రజలకు సందేహిస్తున్నారు.ఇక రెండో వారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంట్లోని 16 మంది గార్డెన్‌ ఏరియాలో ఉన్న పడవలోకి ఎక్కాలి. పడవ ప్రతి తీరం మధ్య ఆగినప్పుడు ఒక్కో సభ్యుడు దాని నుంచి ఖచ్చితంతగా దిగిపోవాల్సి ఉంటుంది. ఇలా తొమ్మిది తీరాల మధ్య పడవ ఆగుతుంది. అంటే 9 మంది నామినేషన్‌ అవుతారు. ఇక పడవలోకి కూర్చొని సభ్యులంతా సరదాగా పాటలతో హోరెత్తించారు.

ఇక మొదటి తీరం రాకముందే పడవ నుంచి నేను పోత అంటే నేను దిగపోతా అంటూ ముందుకు వచ్చారు. ఇంతలోనే దిగేందుకు సరైన కారణం చెబితే తాను దిగిపోతానని కుమార్‌ సాయి తెలిపాడు. దీంతో ఎవరిని పడవ నుంచి దింపేయాలన్న చర్చ సభ్యుల్లో సాగింది. ఇంతోనే అభిజిత్‌ కలగజేసుకొని అవ్వ ఎక్కవ సేపు కూర్చోలేదని చెబుతూ మొదట పడవ దిగమని చెబుతామా అని సలహా ఇచ్చాడు. దానికి అవ్వ సరే చెప్పి తొలి రౌండ్‌లోనే దిగిపోయింది. అయితే ఊహించని విధంగా నోయల్‌ రెండో హారన్‌కు దిగిపోయాడు. మోనాల్‌ మూడో హారన్‌కు పడవ నుంచి దిగేసింది.

ఇంట్లోకి వచ్చిన కుమార్‌ మొదటి రోజే ఇంటి సభ్యులతో మైండ్‌ గేమ్‌ ఆడుతున్నట్లు తెలుస్తోంది. మనసులో దిగాలని లేకపోయిన మీరు చేస్తే దిగుతా అంటూ ప్రతి రౌండ్‌లో తెలివి ప్రదర్శిస్తూ వచ్చాడు. నాలుగో రౌండ్‌ మోగగానే పోహైల్‌, అయిదో బజర్‌కు కరాటే కళ్యాణి దిగిపోయింది. ఆరో హారన్‌కు అమ్మ రాజశేఖర్‌ పడవ నుంచి దిగేసి ఇంట్లోకి వచ్చేశారు. ఏడవ రౌండ్‌లో కుమార్‌, ఎనిమిది హారిక, తొమ్మిది అభిజిత్‌ దిగిపోయాడు.