చెరువులో పడి ప్రేమ జంట ఆత్మహత్య

చెరువులో పడి ప్రేమ జంట ఆత్మహత్య

జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ జంట చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కోదాడ లక్ష్మిపురం కాలనీకి చెందిన సాయి(19) ఐటీఐ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఇతడికి అదే కాలనీకి చెందిన ఫాతిమా(15)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సాయి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. ఫాతిమా నిన్న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

ఆ తర్వాత వీరద్దరూ కోదాడ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వీరి శవాలు వెలుగు చూశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సింది.