చిక్కుల్లో పడ్డ శంకరాభరణం తులసి

Maa President Shivaji Raja Files A Case On Sankarabharanam Tulasi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

శంకరాభరణం చిత్రంలో బాలనటిగా కనిపించి, ఆ తర్వాత హీరోయిన్‌గా నటించి, ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్న తులసి ఇటీవల ‘శంకరాభరణం’ పేరుతో ఫిల్మ్‌ అవార్డులు ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ అవార్డుల వేడుకకు సినీ పరిశ్రమ నుండి నటీ నటులు హాజరు కాలేదు. అందుకు కారణం మా అధ్యక్షుడు శివాజీ రాజా అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. శివాజీ రాజా ఒక జోకర్‌ అంటూ, ఆయన పదవి శాస్వతం అన్నట్లుగా భావిస్తున్నాడు అని ఆమె వ్యాఖ్యలు చేసింది. దాంతో శివాజీ రాజా ఇటీవల తులసిపై పోలీస్‌ కేసు పెట్టాడు. 

శివాజీ రాజా కేసును స్వీకరించిన పోలీసులు తులసికి లీగల్‌ నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. శివాజీ రాజాను అకారణంగా దూషించడంతో పాటు, పరువు పోయేలా మాట్లాడిన కారణంగా కేసు బుక్‌ చేస్తున్నట్లుగా ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. మా తరపున కూడా తమ అధ్యక్షుడిని తులసి దూషించింది అంటూ కేసు నమోదు అయ్యింది. తులసిపై ఇలా కేసు మీద కేసు నమోదు అవ్వడంతో ఆమె ఏం చేయాలో పాలుపోక న్యాయవాదులను ఆశ్రయిస్తుంది. అవార్డు వేడుకకు ఎన్టీఆర్‌తో పాటు ఇతరులను రానివ్వలేదు అనే అక్కస్సుతో తులసి అలా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. అయితే శివాజీ రాజా మాత్రం ఇప్పటి వరకు శంకరాభరణం అవార్డుల విషయమై స్పందించలేదు. అవార్డు వేడుకకు నటీనటులను ఎందుకు వెళ్లనివ్వలేదు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పలేదు.

మరిన్ని వార్తలు

చిరు సరసన సోనాక్షి సిన్హా ?

మంచి మనస్సు చాటుకున్నాడు