హరీశ్ రావు కన్నా మెజార్టీ సాదించిన మాజీ ఉప ముఖ్యమంత్రి

హరీశ్ రావు కన్నా మెజార్టీ సాదించిన మాజీ ఉప ముఖ్యమంత్రి

మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్య మంత్రి అజిత్ పవార్ మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో పుణే జిల్లా బారామతి నియోజకవర్గం నుండి 1.65లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా ఇది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత హరీశ్ రావు మెజార్టీ కంటే ఎక్కువగా రికార్డ్ చేసింది. అజిత్ పవార్ బారామతి నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ రికార్డు సాదించారు.

తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత హరీశ్ రావు సిద్దిపేట కంచుకోటగా ఉంటూ అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ  మహారాష్ట్రలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అజిత్ తాజా గెలుపు ఎవరూ సాధించని విధంగా హరీశ్ రావు సాదించిన  విజయంని అదిగమించి ముందులో ఉన్నారు. ప్రతి ఎన్నికకూ మెజార్టీతో గెలిచి టీఆర్ఎస్ పార్టీ హరీశ్ రావు తాజా ఎన్నికల్లో డబుల్ హ్యాట్రిక్ సాదించారు. మహారాష్ట్ర ప్రస్తుత ఎన్నికల్లో ఏకంగా 165265 ఓట్ల మెజార్టీతో అజిత్ పవార్ గెలుపొందారు.