కోపంతో కుర్చీలు విరగ్గొట్టిన మహేష్ అభిమానులు

కోపంతో కుర్చీలు విరగ్గొట్టిన మహేష్ అభిమానులు

సరిలేరు నీకెవ్వరూ చిత్ర ప్రమోషన్స్ గట్టిగానే మొదలు పెట్టింది చిత్ర బృందం. అయితే పాటలతో, ప్రోమోలతో ఆకట్టుకుంటున్న ఈ చిత్రం ప్రమోషన్లని వేగవంతం చేసే ప్రక్రియలో చిత్ర నిర్మాణ సంస్థ ఆన్లైన్ లో మహేష్ బాబు తో ఫోటో దిగే అవకాశం అని ప్రకటనలు చేసింది. అయితే అభిమానులు తెలుగు రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాల వారు గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి చేరుకున్నారు. అయితే నిర్వాహకులు సరైన విధంగా ఏర్పాట్లు చేయలేకపోవడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.

అక్కడి పరిస్తితులు అదుపుతప్పి తోపులాట జరగగా అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. కాళ్ళు కూడా విరగొట్టుకున్నారు. అయితే అక్కడి బౌన్సర్లు తమ ఫై చేయి కూడా చేసుకున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. అయితే అక్కడి గందరగోళ పరిస్థితికి బారికేడ్లు విరిగిపోయాయి. మహేష్ అభిమానులు కోపం తో అక్కడి కుర్చీలు విరగొట్టారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు, ఫోటో దిగేందుకు వస్తే ఇలానే ప్రవర్తిస్తారా? అంటూ వాపోయారు. అయితే పోలీసుల పెర్మిషన్ తీసుకోలేదని, తీసుకుంటే భద్రత కల్పించేవాళ్లమేనని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ కార్యక్రమం నిర్వహించిన వ్యక్తుల ఫై పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది.