ఎట్టకేలకు ఒకే చెప్పిన మహేష్ బాబు…!

Mahesh Babu Next With Rangasthalam Director Sukumar

మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తనకు 25వ చిత్రం కావడంతో మహేష్ ప్రత్యేక దృష్టిసారించాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పుర్తికావచ్చింది. ఈ చిత్రం తరువాత తన తదుపరి చిత్రంపై ఆ మద్య రకరకాల వార్తలు వచ్చాయి. కొరటాల శివతో ఓ సినిమా ఉంటుంది దానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మహేష్ కు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవ్వని వట్టిపుకార్లు మాత్రమేని మహేష్ సుకుమార్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మహేష్ తో ఇంతకు ముందు నేనొక్కడినే అనే డిజాస్టర్ మూవీ ని తీశాడు. ఆ చిత్రంతో మహేష్ మరల సుకుమార్ తో సినిమా అంటేనే నో అనే పరిస్థితికి వచ్చింది.సుకుమార్ నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమా హిట్ట్స్ తో మంచి ఫాంలోకి వచ్చాడు ఆ స్టామినాతోనే మహేష్ తో మరల ఓ సినిమా తియ్యాలని సుకు గట్టి పటుదలతో ఉన్నాడు.

ఆ నేపద్యంలోనే మహేష్ ను కలిసి ఓ కథకు సంబందించిన స్టోరీ లైన్ వినిపించాడు. మహేష్ కు బాగా నచ్చడం ఒకే చెప్పడం సుక్కు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చెయ్యడంని చక చక జరిగిపోయాయి. మహేష్ తో సుకు సినిమాను ఏప్రిల్ లో ఉంటుందని ఆ మద్య సోషల్ మీడియాలో భాగా వార్తలు వచ్చాయి కానీ కాస్త ఆలస్యంగా ఇప్పుడు మే నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళుతుంది. మొదట మహేష్ తో సంబంధం లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఆ తరువాత మహేష్ జూన్ లో సెట్స్ లో జాయిన్ అవ్వుతాడు.ఈ చిత్రంలో మహేష్ సరసన మొదట రకుల్ ని తీసుకోవాలి అనుకున్నారు కానీ కొన్ని అనివార్యకారణాల వలన ఆ స్థానంలో మరో స్టార్ హీరొయిన్ తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచిస్తుంది. త్వరలోనే మహేష్, సుకు సినిమాకు సంబందించిన పూర్తివివరాలు తెలుస్తాయి.