కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కార్మికుడు మృతి

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కార్మికుడు మృతి

కరోనా వైరస్ తీసుకున్న పారిశుధ్య కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరాలో ఆదివారం చోటు చేసుకుంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు గంటలకే 30 ఏళ్ల పారిశుధ్య కార్మికుడు చనిపోయాడు. వ్యాక్సిన్‌ తీసుకున్నందునే చనిపోయాడని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం కారణనాన్ని నిర్ధారించేందుకు పోస్టుమార్టం కోసం ఆదేశించారు. అతని హృదయ సంబంధ వ్యాధులు ఉన్నాయని, గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని అధికారులు పేర్కొన్నారు.

వడోదరకు చెందిన జిగ్నేష్‌ సొలంకి స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ (వీఎంసీ)లో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. కరోనా టీకా డ్రైవ్‌లో భాగంగా ఉదయం టీకా తీసుకున్నాడు. కొద్ది సమయం తర్వాత ఇంటికి వెళ్లగా సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే కుటుంబీకులు ఎస్‌ఎస్‌జీ హాస్పిటల్‌కు తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సొలంకి భార్య దివ్య మాట్లాడుతూ తన భర్త టీకా తీసుకోబోతున్నాడని తనకు తెలియదని చెప్పింది. టీకా వేసిన అనంతరం ఇంటికి వచ్చాడని.. కూతురితో ఆడుకుంటూ పడిపోయాడని చెప్పింది. మరణానికి టీకానే కారణమని అనుమానిస్తున్నట్లు తెలిపింది.

కొవిడ్‌ టీకా సెంటర్‌లో వ్యాక్సిన్‌ ఇచ్చారని, ఆ తర్వాత అరగంట పాటు పర్యవేక్షించినట్లు చెప్పారు. ఆ సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని, అతని హాస్పిటల్‌లోనే చనిపోయినట్లు పేర్కొన్నారు. జిగ్నేష్‌ ఏడాదిన్నర కిత్రం ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరాడని.. తాము తెలుసుకున్నామని.. గుండెజబ్బుల చరిత్ర ఉన్నందున గుండుపోటు కారణంగా మరణించే అవకాశం ఉందని తెలిపారు.