కన్న తండ్రే కసాయి

కన్న తండ్రే కసాయి

కోపం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అలా మనిషి విచక్షణ మరచి ప్రవర్తిస్తే అఘాయిత్యాలే జరుగుతాయి. తాజాగా ఓ కన్న తండ్రే కసాయిలా మారి తన కుమార్తెను పీకపిసికి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో వెలుగు చూసింది. నిందితుడిని థానేలోని ముంబ్రాకు చెందిన అనీష్ మల్దార్ అనే కార్మికుడిగా గుర్తించినట్లు అధికారి వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు.

“మల్దార్ తన భార్య, కుమార్తెతో కలిసి నివసించేవాడు. గతకొంత కాలంగా ఆ దంపతులు ఇంట్లో చిన్నచిన్న విషయాలపై తరచూ గొడవ పడేవారు. శుక్రవారం రాత్రి, ఏదో విషయమై తన భార్యతో గొడవ ప్రారంభమై, అది కాస్త తీవ్ర వాగ్వాదంగా మారింది. దీంతో కోపం తెచ్చుకున్న ఆ భర్త.. ఏడేళ్ల తమ కుమార్తెపై ఆ కోపం చూపించాడు. క్షణికావేశంలో ఆ అమ్మాయి పీక పిసికి చంపేశాడు. కుమార్తె మృతి గురించి అతని భార్యకు తరువాత తెలియడంతో, ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ తరలించారు.