డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన “మార్క్ ఆంటోనీ”

విశాల్ మరియు ఎస్. జే. సూర్య ప్రధాన పాత్రల్లో, డ్యూయల్ రోల్ చేసిన లేటెస్ట్ సినిమా “మార్క్ ఆంటోనీ”.  అధిక్ రవిచంద్రన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అయింది . అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ హక్కులని కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన “మార్క్ ఆంటోనీ”
Mark Antony

అయితే అక్టోబర్ 13, 2023 నుండి డిజిటల్ ప్రీమియర్ గా స్ట్రీమింగ్ కానున్నది . అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉన్నది . ఈ చిత్రంలో రీతూ వర్మ, సునీల్, సెల్వరాఘవన్, అభినయ, రెడిన్ కింగ్స్లీ, వై.జి.మహేంద్రన్ లు కీలక పాత్రల్లో నటించారు. ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమా కి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.