తమిళనాడులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మరుసటి రోజే వధువు ప్రియుడితో పారిపోయిన ఘటన తమిళనాడులో తాజాగా వెలుగుచూసింది. సేలం జిల్లా చిన్నమసముద్రానికి చెందిన పూమారై కూతురు సత్యకు సెంగవల్లి నడువలూరుకు చెందిన పెరియస్వామి కుమారుడు రవికుమార్తో ఈ నెల నాలుగో తేదీన వివాహం జరిగింది. అయితే రవికుమార్ వరికోత యంత్రం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఐదో తేదీన సాయంత్రం పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లిన సత్య తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు కంగారుపడి చుట్టుపక్కల బాగా వెతికారు. కానీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో సత్య తల్లిదండ్రులు సెంగవల్లి మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.