వధువు ట్విస్ట్ : పెళ్లైన మరుసటి రోజే పరార్ ఆపై …….

marriage

తమిళనాడులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మరుసటి రోజే వధువు ప్రియుడితో పారిపోయిన ఘటన తమిళనాడులో తాజాగా వెలుగుచూసింది. సేలం జిల్లా చిన్నమసముద్రానికి చెందిన పూమారై కూతురు సత్యకు సెంగవల్లి నడువలూరుకు చెందిన పెరియస్వామి కుమారుడు రవికుమార్‌తో ఈ నెల నాలుగో తేదీన వివాహం జరిగింది. అయితే రవికుమార్ వరికోత యంత్రం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఐదో తేదీన సాయంత్రం పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లిన సత్య తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు కంగారుపడి చుట్టుపక్కల బాగా వెతికారు. కానీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో సత్య తల్లిదండ్రులు సెంగవల్లి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే అదే సమయంలో చిన్నసముద్రానికి చెందిన వల్లరసు అనే యువకుడిని సత్య పెళ్లి చేసుకొని రక్షణ కల్పించాలంటూ ఆత్తూర్ పోలీసులను ఆశ్రయించి వారికి మరో ట్విస్ట్ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రవికుమార్‌, బంధువులు, సత్య తల్లిదండ్రులు వెంటనే ఆత్తూర్ పీఎస్‌కు చేరుకున్నారు. తాను వల్లరసు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించకుండా రవికుమార్‌తో బలవంతంగా పెళ్లి చేశారని.. అందుకే ఇంటి నుంచి పారిపోయినట్లు సత్య పోలీసులకు తెలిపింది. దీంతో వరుడు కుటుంబం షాక్ తినింది. అయితే వెంటనే వరుడు కుటుంబం వాళ్లు తనకు పెట్టిన బంగారు ఆభరణాలను పోలీసుల సమక్షంలోనే తిరిగి ఇచ్చేసింది. కాగా పెళ్లికి అయిన ఖర్చును తిరిగిచ్చేయాలని కూడా రవికుమార్‌ కోరడంతో సత్య, వల్లరసు అంగీకరించారు. అందుకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌లోనే స్టాంప్ పేపర్లపై సంతకాలు చేసి ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు.