సుదీర్ఘ విరామం తర్వాత ఫాంలోకి మెగా నిర్మాత

Mega producer ashwin dutt Confirms-Movie with junior ntr

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

మెగా నిర్మాత అనగానే ప్రస్తుతం ప్రేక్షకులు అంతా కూడా అల్లు అరవింద్‌ అనుకుంటారు. కాని 1980లలో మెగా నిర్మాతగా అశ్వినీదత్‌కు పేరు. మెగాస్టార్‌తో వరుసగా సినిమాలు నిర్మించి సూపర్‌ హిట్స్‌ దక్కించుకున్న కారణంగా అశ్వినీదత్‌కు మెగా నిర్మాత అంటూ పేరు వచ్చింది. అంతటి స్టార్‌ నిర్మాత ఎన్టీఆర్‌తో నిర్మించిన ‘శక్తి’ కారణంగా పత్తా లేకుండా పోయాడు. ఆ చిత్రంతో డిజాస్టర్‌ను సొంతం చేసుకున్న అశ్వినీదత్‌ కోట్లల్లో నష్టాలను కూడా చవి చూశాడు. దాంతో కొన్ని సంవత్సరాల పాటు అశ్వినీదత్‌ సినిమాలకు దూరం అయ్యాడు. ఆ దెబ్బకు ఎంతో ఇష్టపడి, కష్టపడి పెట్టుకున్న ఛానెల్‌ కూడా మూత పడటం జరిగింది. మళ్లీ ఇన్నాళ్లకు మెగా నిర్మాత ఫాంలోకి వచ్చాడు.

తాజాగా తమ బ్యానర్‌లో వచ్చిన ‘మహానటి’ చిత్రంతో అశ్వినీదత్‌ సూపర్‌ హిట్‌ను దక్కించుకున్నాడు. ఆ సినిమా సక్సెస్‌తో వరుసగా మళ్లీ పెద్ద సినిమాలను, మెగా సినిమాలను నిర్మించాలని అశ్వినీదత్‌ భావిస్తున్నాడు. ‘మహానటి’తో చిత్ర నిర్మాతకు 50 కోట్లకు తగ్గకుండా లాభం చేకూరినట్లుగా సమాచారం అందుతుంది. ఇకపై చాలా జాగ్రత్తగా సినిమాలు తీయాలని, సినిమా బడ్జెట్‌ మరియు మార్కెట్‌ను బేరీజు వేసుకుని సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దిల్‌రాజుతో కలిసి మహేష్‌బాబు 25వ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమాకు రంగం సిద్దం అవుతుంది.

శక్తి తర్వాత ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమా అవ్వడంతో కాస్త టెన్షన్‌ కామన్‌. అయితే ఎన్టీఆర్‌ క్రేజ్‌కు తగ్గట్లుగా సినిమాను నిర్మించి, మంచి బిజినెస్‌ను రాబట్టాలనేది అశ్వినీదత్‌ ప్లాన్‌. మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లతో పాటు చిరంజీవి, రామ్‌ చరణ్‌లు కూడా అశ్వినీదత్‌ బ్యానర్‌లో సినిమాలు చేయాలని ఉబలాటపడుతున్నారు. మొత్తానికి మెగా నిర్మాత వరుసగా సినిమాలు చేయడం ఖాయం అయ్యింది. అశ్వినీదత్‌ కుమార్తెలు స్వప్న మరియు ప్రియాంకలు తండ్రికి చేదోడు వాదోడుగా సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యులు అవుతున్నారు.