మెగాస్టార్ కి కరోనా పాజిటివ్

మెగాస్టార్ కి కరోనా పాజిటివ్

చిరంజీవి ఇవాళ చేసిన ట్వీట్ ఆయన అభిమానులతో పాటు పలువురిని షాక్‌కు గురి చేసింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు మెగాస్టార్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆచార్య సినిమా షూటింగ్ కోసం కరోనావైరస్ టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందన్నారు. అయితే చిరంజీవికి కరోనా సోకడంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే చిరంజీవి సీఎం కేసీఆర్‌ను కలిశారు. పలువురు సినీ ప్రముఖులతో కలిసి ఆయన.. శనివారం ముఖ్యమంత్రితో ప్రగతిభవన్‌లొ భేటీ అయ్యారు. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి.

అయితే చిరంజీవి భుజంపై కేసీఆర్ చేయి వేస్తూ చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా కరోనా టెస్టులు చేయించుకుంటారా ? లేకపోతే.. సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్తారా ? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. చిరంజీవి వెంట నాగార్జున, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కూడా ఉన్నారు. దీంతో ఇప్పుడు వారికి కూడా కరోనా భయం వెంటాడుతున్నట్లు సమాచారం.