బాలయ్య అడగ్గానే వెంటనే ఒప్పుకున్న మెగాస్టార్

బాలయ్య అడగ్గానే వెంటనే ఒప్పుకున్న మెగాస్టార్

బాలయ్య కు  సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆయన కు సంబందించిన ఏ చిన్న విషయానైనా సోషల్ మీడియా లో వైరల్ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ వార్తనే హైలైట్ చేస్తున్నారు. అది కూడా బాలయ్య – చిరంజీవి లకు సంబందించిన వార్త .

1991లో బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా రిలీజ్ అయ్యింది. సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చి చిన్నలను పెద్దలను అందరిని ఆకట్టుకుంది. అయితే, ఇప్పటిలా అప్పట్లో సోషల్ మీడియా పెద్దగా లేదు. సినిమాకు ప్రమోషన్ చేయాలి అంటే ఒకటి పేపర్లో యాడ్ ఇవ్వాలి లేదంటే దూరదర్శన్ లో ఓ యాడ్ ఇవ్వాలి. దూరదర్శన్ లో ఈ సినిమాకు సంబంధించిన యాడ్ ను చేసి ప్రమోట్ చేయాలని సింగీతం శ్రీనివాసరావు, నిర్మాతలు అనుకున్నారట.

మెగాస్టార్ చిరంజీవితో ఆ యాడ్ చేయిస్తే.. సినిమాకు ప్లస్ అవుతుందని భావించి మెగాస్టార్ ను కలిసి యాడ్ విషయం గురించి అడగ్గానే వెంటనే ఒప్పుకున్నారట. అలా బాలకృష్ణ ఆదిత్య 369 సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ప్రమోషన్ చేసారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.