ప్రియుడి మోజులో కన్న కొడుకునే చంపిన కసాయి తల్లి

అమ్మతనం చిన్నబోయేలా చేసింది ఓ నిర్భాగ్యురాలు. ప్రియుడి మోజులో పడి ఐదేళ్ల తన కుమారుడిని నానా రకాలుగా హింసించి చంపింది. ప్రియుడితో కలసి అతి దారుణమైన చిత్ర హింసలకు గురి చేసింది. అసలేం జరిగిందంటే.. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ తనమీద తానే మూత్రాన్ని పోసుకుని ఆ చిన్నారి పోశాడని చాడీలు చెప్పాడు. అంతటితో ఆగకుండా.. ఆ చిన్నారిని కొట్టమని ఆదేశించాడు. దాంతో ఆమె విచక్షణా రహితంగా కన్నకొడుకుని చచ్చేలాగా కొట్టింది.

ఆ తల్లి కొట్టిన దెబ్బలకు ఆ చిన్నారి పక్కటెముకలు విరిగిపోయాయి. అలా స్పర్శ లేకుండా పడి ఉన్నా.. కనీసం జాలి కూడా చూపలేదు. ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్న కొడుకును అలాగే వదిలేయడంతో నెమ్మదిగా అవయవాలు పనిచేయడం మానేశాయి. చివరకి ఆ చిన్నారి ప్రాణాలు వదిలాడు. అయితే ఆ చిన్నారి మృతి తర్వాత ఆమె ఓ పిచ్చి ఉపాయం పన్నింది. హత్యను ఆకస్మిక మరణంగా చూపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. అత్యవసర సేవలకు ఫోన్ చేసి తన కొడుకు పడిపోయాడని.. అపస్మారక స్థితిలో ఉన్నాడంటూ.. అబద్దాలు ఆడింది. కోర్డు ఆమె చేష్టలను తెలుసుకొని కఠిన కారాగార శిక్ష విధించింది.

యూఎస్ లోని చికాగోలో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్తతో విడిపోయిన జాక్వెలిన్ అనే ఆమె ప్రియుడి మోజులో పడి కొడుకును చంపేసుకుంది. చిన్నగా వివరాలు రాబట్టిన కోర్టు.. త్యాగం, నిస్వార్థ తల్లిప్రేమకే కళంకం తెచ్చిన ఆ కసాయి తల్లికి ఏకంగా 50 ఏళ్లు కఠిన జైలుశిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది.