తండ్రికి ప్రేమ‌గా మంచినీళ్లు అందిస్తున్న కూతురు

ms-dhoni-given-water-by-his-daughter-ziva-after-football-match

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

క్రికెట‌ర్లు పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డిపేందుకు దొరికే టైం చాలా త‌క్కువ‌. ఎప్పుడూ అంత‌ర్జాతీయ టూర్ లు, మ్యాచ్ లు, ప్రాక్టీస్ తోనే వారి స‌మ‌యం గ‌డిచిపోతుంటుంది. అందుకే ఏ కాస్త ఖాళీ టైం దొరికినా పిల్ల‌ల‌ను త‌మ వెంట తీసుకెళ్తుంటారు. ఇండియాలో మ్యాచ్ లు ఉంటే..ఎప్పుడూ పిల్ల‌ల‌తోనే క‌లిసి క‌నిపిస్తుంటారు. ప్ర‌స్తుతం మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ ఇదే చేస్తున్నాడు. ఎప్పుడూ జీవాను త‌న వెంటే ఉంచుకుంటున్నాడు. త‌న కూతురు ముద్దుముద్దుగా చెప్పే మాట‌లు, అల్ల‌రి చేష్ట‌లు ఎంజాయ్ చేస్తున్నాడు. వాటికి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. అందుకే ఈ మ‌ధ్య ధోనీ కూతురు జీవా సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. రాంచీలో భార‌త్, ఆస్ట్రేలియా మ్యాచ్ త‌ర్వాత ధోనీ భార‌త ఆట‌గాళ్ల‌ను త‌న ఇంటికి విందుకు ఆహ్వానించాడు. ఆ సంద‌ర్భంగా టీమిండియా స‌భ్యులంతా ధోనీ ఇంట్లో జీవాతో కాసేపు స‌ర‌దాగా ఆడుకున్నారు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ, జీవాతో ఆడుకున్న వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. దీని త‌రువాత ధోనీ జీవాతో క‌లిసి మిఠాయి తింటున్న ఓ వీడియోను ఇన్ స్టా గ్రాంలో అభియానుల‌తో పంచుకున్నాడు. తాజాగా తండ్రీ కూతుళ్ల మ‌రో వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న త‌ర్వాత‌… న్యూజిలాండ్ భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చింది. ఈ నెల 22 నుంచి రెండు దేశాల మ‌ధ్య వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. మ్యాచ్ లు జ‌ర‌గ‌డానికి కొన్నిరోజుల విరామం ఉండ‌డంతో టీమిండియా స‌భ్యులు ప్ర‌స్తుతం దీపావ‌ళి సెల‌వులు తీసుకున్నారు. ఈ సెల‌వుల్లో స‌రదాగా వారు, సెల‌బ్రిటీల‌తో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారు. ముంబై అంధేరీలోని ఫుట్ బాల్ ఎరీనాలో కోహ్లీ నేతృత్వంలోని ఆల్ హార్ర‌ట్ ఎఫ్సీ.. అభిషేక్ బ‌చ్చ‌న్ నేతృత్వంలోని ఆల్ స్టార్స్ ఎఫ్సీ జ‌ట్టుతో ధార్మిక మ్యాచ్ ఆడింది.

ఈ మ్యాచ్ లో త‌న‌కు ల‌భించిన ఫ్రీ కిక్ ను సద్వినియోగం చేసుకుని గోల్ కీప‌ర్ మార్క్ రాబిన్ స‌న్ కు చిక్క‌కుండా బంతిని గోల్ పోస్ట్ లోకి పంచించాడు ధోనీ. అనంత‌రం విశ్రాంతి స‌మయంలో అల‌సిపోయి మైదానంలో కూర్చుని ఉన్న ధోనీకి కుమార్తె జీవా బుడిబుడి అడుగుల‌తో వ‌చ్చి మంచినీళ్లు అందించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కుమార్తె ప్రేమ‌గా తండ్రికి మంచినీళ్లు అందిస్తున్న వీడియో చూసి నెటిజ‌న్లు సంతోషం వ్య‌క్తంచేస్తున్నారు. ఈ మ్యాచ్ లో అభిషేక్ బ‌చ్చ‌న్ జ‌ట్టు 7-3 తేడాతో కోహ్లీ టీం ను ఓడించింది. ధోనీ రెండు గోల్స్ సాధించి మ్యాచ్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు.