Sports: మహేంద్ర సింగ్ ధోనీపై పరువు నష్టం దావా

Sports: Defamation suit against Mahendra Singh Dhoni
Sports: Defamation suit against Mahendra Singh Dhoni

టీం ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనికి ఊహించని షాక్‌ తగిలింది. క్రికెట్ అకాడమీ విషయంలో మాజీ వ్యాపార భాగస్వాములు తనను రూ. 15 కోట్ల మేర మోసం చేశారంటూ టీం ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్లు మిహిర్ దివాకర్, సౌమ్య దాస్…. ఇప్పుడు ధోనిపై పరువు నష్టం దావా వేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని, తమ పరువుకు భంగం వాటిల్లినందుకుగాను ఆయన నష్టపరిహారం చెల్లించాలని వారు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమపై అవాస్తవాలను ప్రచారం చేయకుండా సామాజిక మాధ్యమాలు, మీడియా సంస్థలను నిలువరించాలని కోరారు. వీరి అభ్యర్థనపై హైకోర్టు జనవరి 18న విచారణ జరపనుంది.