మరో కూతురు ఎంట్రీ… అధికారిక ప్రకటన

Rajasekhar daughter Shivani tollywood entry confirm

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
టాలీవుడ్‌లోకి వారసులుగా కొడుకులు లేదా అల్లుడు రావడం మనం ఇప్పటి వరకు చూశాం. కాని ఇటీవల నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ట్రెండ్‌ సెట్‌ చేసింది. మంచు లక్ష్మి అంతకు ముందే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఆమె హీరోయిన్‌గా కాదు. అందుకే టాలీవుడ్‌లో మొదటి హీరోయిన్‌ వారసురాలిగా నిహారిక అని చెప్పుకోవచ్చు. నాగబాబు కూతురు అయిన నిహారిక ఇప్పటికే ఒక సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం రెండు సినిమాలను చేస్తోంది. వచ్చే సంవత్సరం ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో అందరి దృష్టి ‘హ్యాపీ వెడ్డింగ్‌’ అనే చిత్రంపై ఉంది. ఇక నిహారిక తర్వాత మరో వారసురాలు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.

యాంగ్రీ యంగ్‌మన్‌గా గుర్తింపు దక్కించుకున్న రాజశేఖర్‌ కూతురు శివానీ చాలా కాలంగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చాలా కాలం క్రితం జీవిత తన కూతురు హీరోయిన్‌ అవుతానంటుంది అంటూ చెప్పడంతో అప్పటి నుండి కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు శివానీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంపై క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్లు ఎంబీబీఎస్‌ చదువుతూ బిజీగా ఉన్న శివానీ తాజాగా చదువు పూర్తి చేసింది. ప్రాక్టీస్‌ కూడా ప్రారంభించింది. ఈ సమయంలోనే ఈమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

తాజాగా రాజశేఖర్‌ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తన కూతురు హీరోయిన్‌గా పరిచయం కాబోతుందని, తన ఆసక్తిని, అభిరుచిని గౌరవించి ఆమెను సినిమాల్లోకి తీసుకుని రావాలని నిర్ణయించుకున్నాం అన్నాడు. రాజశేఖర్‌ ప్రస్తుతం తన కూతురు కోసం స్క్రిప్ట్‌లు వింటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. కమర్షియల్‌ హీరోయిన్‌గా శివానీ నటిస్తుందా లేదా ఆర్ట్‌ సినిమాలకే పరిమితం అవుతుందో చూడాలి.