అటవీ ప్రాంతంలో హత్య

అటవీ ప్రాంతంలో హత్య

ఈ నెల 5వ తేదీన తాలూకా రామచంద్రపురం అటవీ ప్రాంతంలో ఘజైల్‌ఖాన్‌ అనే వ్యక్తి హత్య కేసులో నిందితులను రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు హిందూపురం తాలూకా మద్దిపి గ్రామానికి చెందిన ప్రమీళ (26), ఆమె రెండవ ప్రియుడు సురేశ్‌ (27)లు. ప్రమీళ భర్తను వదిలేసి మొదట్లో హిందూపురంవాసి, ఆటోడ్రైవర్‌ ఘజైల్‌ ఖాన్‌ అలియాస్‌ సుహేల్‌ (24)తో సహజీవనం చేసేది.

అతనితో గొడవలు రావడంతో సురేశ్‌కు దగ్గరైంది. అయినా ఘజైల్‌ఖాన్‌ ఆమెను వేధిస్తుండడంతో సురేశ్‌తో కలిసి రామచంద్రపురం అటవీప్రాంతానికి పిలిపించి హత్య చేసింది. శనివారం రాత్రి నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు.