‘బాహుబలి’తో చైతూ ‘యుద్దం శరణం’కు సంబంధం ఏంటి?

Nagachaitanya as drone camera oppearte prabhas bahubali movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
యువ హీరో నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన ‘యుద్దం శరణం’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సినిమాలో మొదటి సాని విలన్‌గా శ్రీకాంత్‌ కనిపించబోతున్నాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాకు బాహుబలి చిత్రానికి సంబంధం ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. నాగచైతన్య ఈ చిత్రంలో డ్రోన్‌ కెమెరాల ఆపరేటర్‌గా కనిపించబోతున్నాడు. అందుకే కొన్ని సీన్స్‌ను ‘బాహుబలి’ సెట్టింగ్స్‌లో చిత్రీకరించడం జరిగింది. ‘బాహుబలి’కి సంబంధించి కొన్ని మేకింగ్‌ వీడియోలు కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నాయి.

‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ‘యుద్దం శరణం’ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఐడియాతోనే ‘బాహుబలి’ని ఈ చిత్రంలో పార్ట్‌ చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. నాగచైతన్య పరిచయ సీన్స్‌ ‘బాహుబలి’ సెట్టింగ్స్‌లో ఉంటుందట. ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంను వచ్చే నెల 8న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చైతూ కెరీర్‌లో ఇదో విభిన్న చిత్రంగా నిలిచిపోతుందని దర్శకుడు చెబుతున్నాడు. ప్రముఖ నిర్మాత వారాహి చలన చిత్ర అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించాడు.

మరిన్ని వార్తలు:

అఖిల్ ‘హలో’ టీజర్ ని రిలీజ్ చేసిన సెలబ్రిటీస్… వీడియో

చిరు 151 టైటిల్ మారింది… కటౌట్ అదిరింది – వీడియో