Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇండియాటుడే నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ ఏపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాజాగా ముఖ్యమంత్రి తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ చెప్పిన మాట నిజమేనని, తెలంగాణకు, ఏపీకి మధ్య పోలికేలేదని లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఏపీకి కియా మోటార్స్, హీరో మోటార్స్, అపోలో టైర్స్, ఏషియన్ పెయింట్స్ వచ్చాయని, తెలంగాణలో ఆ పరిస్థితి లేదని సెటైర్ వేశారు. ఏపీకి బడా కంపెనీలు తరలివస్తున్నాయని, భారీ పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఆ తరహా వ్యాఖ్యలు చేసుండాల్సింది కాదన్న అభిప్రాయం వినపడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, విభజన తర్వాతా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్వేష వాతావరణం ఇప్పుడు లేదని, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుహృద్భావ భావంతో ముందుకు వెళ్తోంటే..తన వ్యాఖ్యలతో కేసీఆర్ మళ్లీ విభేదాలు సృష్టిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.