National Politics: సీఎం అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు

BREAKING NEWS: Delhi CM Kejriwal gets relief in High Court
BREAKING NEWS: Delhi CM Kejriwal gets relief in High Court

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.విచారణకు పలుమార్లు గైర్హాజరైన కేజ్రివాల్ పై ఈడి మెజిస్టీరియల్ కోర్టుకు వెళ్లింది. దీంతో 16న తమ ఎదుట హాజరుకావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు. దీనిపై స్టే ఇవ్వాలన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ను సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో ఈరోజు అవెన్యూ కోర్టు ఎదుట హాజరయ్యారు. అనంతరం ₹15 వేల బాండ్, ₹1 లక్ష పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే….. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మరికాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో కోర్టు పరిసరాల్లో పోలీసులు భద్రతను పటిష్ఠం చేశారు.