National Politics: రాహుల్ గాంధీ “భారత్ న్యాయ యాత్ర” పై కాంగ్రెస్‌ కీలక నిర్ణయం..!

National Politics: Congress' key decision on Rahul Gandhi's
National Politics: Congress' key decision on Rahul Gandhi's "Bharat Nyaya Yatra"!

రాహుల్ గాంధీ “భారత్ న్యాయ యాత్ర” పై కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న లోకసభ ఎన్నికలు, రాహుల్ గాంధీ “భారత్ న్యాయ యాత్ర” పై సమాలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే… నేడు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరుగనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ విస్తృత సమావేశం జరుగుతుంది.

ఈ తరుణంలోనే, ఇప్పటికే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీకి ఈ రోజు ఉదయం చేరుకున్నారు. అటు ఢిల్లీకి చేరుకున్నారు ఏపిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యనేతలతో ఈ సమావేశం జరుగనుంది.

రానున్న లోకసభ ఎన్నికలకు సమాయత్తం పై సమాలోచనలు, రాహుల్ గాంధీ నేతృత్వంలో జరగనున్న “భారత్ న్యాయ యాత్ర” పై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. కాగా మణిపూర్ నుంచి ముంబై వరకు “భారత్ న్యాయ యాత్ర” జరుగనుంది. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు రాహుల్ గాంధీ “బస్సు, పాదయాత్ర” కొనసాగనుంది.