తల్లి కాదు…సైకో….అభిరామి కేసులో సంచలనం…!

New Twists In Abhirami Case
ప్రియుడి మోజులో పడి ఇద్దరు పిల్లకు పాలలో విషం కలిపి పట్టించి హత్య చేసిన అభిరామి కేసు విచారణలో పలు సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. నిందితురాలు అభిరామి సెల్‌ఫోన్‌కు బానిసై ఇంట్లో పిల్లలతో భర్తతో సైకోలో ప్రవర్తించేదని పోలీసుల విచారణలో తెలిసింది. అమ్మ దగ్గరకు వెళ్లాలనుకునే పిల్లలను అభిరామి కసిరికొట్టేదనీ, వారిని తీవ్రంగా హింసించేదని తేలిందట. భర్త ఆఫీసుకు వెళ్లగానే ప్రియుడు సుందరంతో గంటలకొద్దీ వీడియో కాల్ మాట్లాడుతూ గడిపేదని తేలింది.
abhirami-murder-case
ఈ తరుణంలో తనకు ప్రియుడికి మధ్య భర్త, పిల్లలు అడ్డుగోడలుగా అనిపించడంతో భర్తను పిల్లల్ని హతమార్చి ప్రియుడితో పారిపోవాలని అభిరామి అనుకుందనీ, కానీ భర్త బ్యాంకు నుంచి ఆలస్యంగా రావడంతో పిల్లాడు అజయ్(7) అమ్మాయి కరిమిలా(5)కు పాలలో విషం కలిపి ఇచ్చి పారిపోయిందని పోలీసులు తెలిపారు. భర్త బ్యాంకులో పని నిమిత్తం అక్కడే ఉండిపోవడంతో ఈ హత్య నుంచి తప్పించుకున్నాడు.
abhirami-case