ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు ఒక్కరోజే.. 10 లక్షలు !

విజయ్‌ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ చిత్రం గురించి ప్రస్తుతం ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేవలం మూడు రోజుల్లో దాదాపు 38 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను దక్కించుకున్న ఈ చిత్రంలో గెస్ట్‌ పాత్రల్లో అను ఎమాన్యూల్‌ మరియు నిత్యామీనన్‌లు కనిపించిన విషయం తెల్సిందే. నిత్యామీనన్‌ సినిమా ఆరంభం నుండి చివరి వరకు కనిపిస్తూ, సినిమా మొత్తం ఉన్నట్లుగా అనిపించింది. అయితే అను ఎమాన్యూల్‌ మాత్రం కేవలం ఒక్క సీన్‌కు పరిమితం అయ్యింది. ఈ ఇద్దరు హీరోయిన్స్‌ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచారు అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు.

ఈ రెండు పాత్రలకు మామూలు క్యారెక్టర్‌ ఆర్టిస్టులను తీసుకున్నా కథ నడిచి పోతుంది. కాని దర్శకుడు కాస్త తెలివిగా సినిమాకు గ్లామర్‌ అద్దాలని, ప్రేక్షకుల్లో ఆసక్తిని కలుగ జేయాలనే ఉద్దేశ్యంతో ఇద్దరు హీరోయిన్స్‌తో ఆ గెస్ట్‌ రోల్స్‌ను చేయించడం జరిగింది. ఆ ఇద్దరు కూడా కేవలం ఒక్క రోజు కాల్షీట్‌తోనే నటించారు అని, అను ఎమాన్యూల్‌ మరియు నిత్యామీనన్‌లు ఒక్క రోజు కాల్షీట్‌ కోసం 5 లక్షల చొప్పున తీసుకున్నట్లుగా సమాచారం. కేవలం పది లక్షల రూపాయలతో ఆ ఇద్దరిని నటింపజేసి సినిమాపై ఆసక్తి పెరిగేలా దర్శకుడు చేయడం అతడి ప్రతిభకు నిదర్శణం అన్నట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు. మొదటి వారాంతంకు ఈ చిత్రం 50 కోట్లను క్రాస్‌ చేయడం ఖాయం అంటూ తేలిపోయింది. ఇక లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.