మోడీకి మరో హోదా షాక్… యూటర్న్ తీసుకున్న నితీశ్

Nitish Kumar comments on Modi for Bihar Special Status

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ అది ఇవ్వకుండా మోసం చేస్తూ కాలం గడుపుతూ వచ్చిన బీజేపీ తో తెగదెంపులు చేసుకుంది టీడీపీ. అయితే టీడీపీ తమను వదిలిపెట్టినంత మాత్రాన తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని, తమకు నితీశ్ ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా ఇటీవల ఒక సభలో ప్రకటించారు కూడా అయితే ఇప్పుడు కాషాయ బాస్ లకు షాక్ ఇచ్చేలా బిహార్‌ సీఎం నితీశ్ యూ టర్న్ తీసుకున్నారు. తాజాగా పెద్ద నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వపై పలు ఆరోపణలు చేసిన నితీష్‌ కుమార్‌ మరోసారి కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌కు ప్రత్యేకహోదా అంశాన్ని ఈ సారి బలంగా తెరపైకి తెచ్చారు. ప్రత్యేకహోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పోరాటం నిరసన కార్యక్రమాలు బీజేపీ కి కంటి మీద కునుకు లేకుండా చేసాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందో… అప్పటి నుంచి బీజేపీకి ఇబ్బందులు తెలేత్తుతున్నాయి. మొన్న కర్నాటక ఎన్నికలు ఇప్పుడు కొత్తగా… మరో ప్రత్యేకహోదా ఉద్యమం ఇవన్నీ మోదీకి గండాలు గానే ఉన్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్… నరేంద్రమోదీకి వ్యతిరేకంగా మెల్లగా గళమెత్తుతున్నారు.

బీహార్‌కు ప్రత్యేకహోదా డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. కానీ… బీహార్ సీఎం దాన్ని రాజకీయంగా తనకు అవసరమైనప్పుడే బయటకు తీస్తూంటారు. అందుకే బీజేపీ నేతల్లో టెన్షన్ ప్రారంభమయింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని మొన్నటిదాకా ప్రశంసిస్తూ వచ్చిన నితీష్… ఇప్పుడు అదో పెద్ద స్కాం అన్నట్లు మాట్లాడుతున్నారు. సడన్ గా యూ టర్న్ తీసుకుని నోట్ల రద్దు మోదీ సర్కారును కార్నర్ చేద్యడంతో బీజేపీ అధిష్టానం ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించింది. ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా ప్రత్యేక హోదా అంశాన్ని బయటకు తీశారు. 18 ఏళ్ల క్రితం బీహార్‌ను విభజించి… జార్ఖండ్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి పునర్ విభజన చట్టంలో ప్రత్యేకహోదా ఉందని… బీహార్‌కు దాన్ని ఇంకా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. నాటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి పర్యవేక్షణలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే బీహార్ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేదని నితీశ్ అంటున్నారు. ఇప్పుడు నీతి ఆయోగ్ పర్యవేక్షణలో అలాంటి సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నితీష్ మొదట బీజేపీతోనే స్నేహంగా మెలిగేవారు. కానీ మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో… ఆయన తీవ్రంగా వ్యతిరేకించి అసెంబ్లీ ఎన్నికలలలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీతో జతకట్టి… ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో నితీష్ పార్టీ జేడీయూ కన్నా… ఆర్జేడీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. అయినా ముందు ఇచ్చిన మాట ప్రకారం… నితీష్ నే సీఎం చేశారు లాలూ. తర్వాత మోదీ ప్రభంజనం బాగా ఉందన్న భావనతోనో… మోదీతో ఏర్పడిన సన్నిహిత సంబంధాల వల్లనో కానీ… లాలూపై అవినీతి ఆరోపణలు సాకుగా చూపి ఆర్జేడీకి కటిఫ్ చెప్పి… బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్. కానీ ఇప్పుడు మోదీ మానియా క్రమంగా మసకబారడం వల్ల మరలా గెలవాలంటే మోడీ తో ఉంటె పనవ్వదు కాబట్టి ఇప్పుడు ఆయన ప్లేటు మార్చి మాట్లాడుతున్నారు అనేది విశ్లేషకుల వాదన. ఏది ఏమయినా ఇప్పుడు నితీష్ కూడా తిరుగుబాటు చేసి ఏపీ సరసన నిలబడితే అప్పుడు బీజేపీ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది, ఇప్పటికే ఒక రాష్ట్రము విషయంలో కవర్ చేసుకోలేక చస్తున్న బీజేపీ నేతలు మరో రాష్ట్రంలో ప్రత్యేక హోదా వేడి రాజుకుంటే ఇక ఈ సారి ఇంటికే నన్న వాదన విశ్లేషకులు బలంగా వినిపిస్తున్నారు.