ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం

ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం

ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుడిసెకు నిప్పంటుకుని ఓ వృద్ధురాలు సజీవ దహనమైంది. ఈ సంఘటన ఇంద్రవెల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఇంద్రవెల్లి మండలం హిరాపూర్ గోపాలపూర్ శివారులో ఓ వృద్ధురాలు గుడిసెలో నివాసం ఉంటోంది. శుక్రవారం గుడిసెలో ఉన్న పత్తికి నిప్పంటుకోవటంతో.. ఆ అగ్ని కీలలు గుడిసెకు ఎగబాకాయి.

దీంతో గుడిసె మొత్తం పెద్ద మంటతో తగలబడిపోయింది. మంటలలో చిక్కుకోని వృద్ధురాలు మాంసపు ముద్దగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వంట చేస్తున్న సమయంలో సంభవించిన అగ్ని ప్రమాదమే వృద్ధురాలిని బలితీసుకుందని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.