బాలికపై అత్యాచారం….పెట్రోల్ తో దహనం

బాలికపై అత్యాచారం....పెట్రోల్ తో దహనం

జిల్లాలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలికపై ఓ కీచక వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే ముస్తాఫా‌ నగర్‌లోని ఓ సంపన్న కుటుంబంలో 13 ఏళ్ల బాలిక పనిమనిషిగా చేరింది. అయితే యజమాని కుమారుడు…బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటిం‍చడంతో ఆమెపై పెట్రోల్  పోసి నిప్పటించాడు.

పల్లెగూడెం గ్రామానికి చెందిన ఆ బాలిక 70 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా ఈ దూరాగతానికి పాల్పడిన యజమాని కుమారుడు బాలికను తీవ్రంగా బెదిరించినట్లు సమాచారం. ఈ విషయం ఎవరికైనా చెబితే బాలికతో పాటు తల్లిదండ్రులను కూడా చంపుతానని బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.