పరువు తీసిందని…ఊపిరి తీసేసారు !

neha chaudhary killed in maharashtra

బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు చెట్టాపట్టాలేసుకు తిరగడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. పైగా తమ కూతురు చెయ్యి పట్టుకుని తిరుగుతున్నది మరో కులస్తుడని తెలియడంతో ఆ తల్లిదండ్రుల్లోని రాక్షషులు నిద్ర లేచారు. ఇంటికి వచ్చిన కూతురికి మత్తు మందు కలిపిన ఆహారం తినిపించారు. అనంతరం హత్యచేసి గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని పూడ్చేశారు. మహారాష్ట్రలోని మాలేగాం పట్టణంలో జరిగిన ఈ దారుణం పోలీసులకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం ద్వారా వెలుగు లోకి వచ్చింది చూసింది. అందుతున్న సమాచారం మేరకు మాలేగాం పట్టణంలోని ఇంద్రాణి కాలనీకి చెందిన నేహా చౌదరి (18) పన్నెండవ తరగతి చదువుతోంది.తన జన్మదినోత్సవం సందర్భంగా తమ కులానికి చెందని వేరే వ్యక్తితో కలిసి పట్టణ శివారు ప్రాంతానికి వెళ్లింది. తల్లితండ్రులకు విషయం తెలిసి కులంకాని వాడితో తిరిగి కుటుంబం ‘పరువు’ తీస్తోందని తలిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోయారు.

neha chaudhary

జన్మదిన వేడుకల నుంచి వచ్చిన నేహాపై ఆమె తల్లిదండ్రులు శరద్‌, సుమిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కుమార్తెకు నిద్రమాత్రలు కలిపిన ఆహారాన్ని పెట్టారు. నిద్రలో ఉండగానే నేహాను చంపేసి శ్మశానానికి తరలించి పూడ్చేశారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లి పూడ్చి పెట్టిన శవాన్ని వెలికి తీయించి స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టంలో నేహాది హత్యని తేలడంతో నేహా తల్లిదండ్రులు, ఆమె బంధువులను విచారించారు. విచారణలో ఇతర కులం యువకుడిని ప్రేమించి తప్పు చేయడంతో తామే హత్య చేశామని వారు అంగీకరించారు. దీంతో హత్య కేసు నమోదు చేసి నేహా తల్లిదండ్రులు శరద్‌, సుమితా, వారి సమీప బంధువు నీలేష్‌ను అరెస్టు చేశారు.