వైసీపీ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

వైసీపీ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉద్యమాన్ని అణచివేయడానికి పోలీస్ బలం ఉపయోగిస్తున్నారని నిప్పులు చెరిగారు పవన్. రాజధాని అమరావతిని రక్షించుకొనేందుకు రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే పోలీస్ బలం తో ప్రభుత్వం అణచివేయాలని ప్రయత్నిస్తుంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ని అరెస్ట్ చేసారని ఆరోపించారు. ఇలాంటి చర్యల వలన శాంతియుతంగా వున్న ఉద్యమం హింసాత్మకంగా మారుతుంది అని అన్నారు.

రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే రాజధాని విషయం ఫై వున్న గందరగోళానికి వైసీపీ ప్రభుత్వం తక్షణమే తెర దించాలని అన్నారు. మహిళల్ని, వృద్ధుల్ని పోలీస్ స్టేషన్లకి తరలిస్తున్న తీరు ఎంత మాత్రం సమంజసం కాదని పవన్ అన్నారు. గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఘటనలు ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఉదృతం అవుతుందని అన్నారు. ఇలాంటి చర్యలని మానుకొని రాజధాని విషయం ఫై స్పష్టత ఇవ్వాలని పవన్ అన్నారు.