Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ గత నాలుగు సంవత్సరాలుగా సినిమాలు, రాజకీయాలు అంటూ ఊగిసలాడుతూ ఉన్నాడు. జనసేన పార్టీ ప్రారంభించినప్పటి నుండి కొన్ని రోజులు రాజకీయాల్లో హడావుడి, మరి కొన్ని రోజులు సినిమాలతో హడావుడి చేశాడు. తాజాగా చేసిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పాటు వచ్చే సంవత్సరంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకు సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ఎన్నికల్లో పోటీ చేసే విషయమై మరియు ప్రత్యేక హోదా విషయమై పవన్ పార్టీ నాయకులతో సమాలోచనలు చేస్తున్నాడు.
ఇక ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత పవన్ రెండు చిత్రాలకు అడ్వాన్స్ తీసుకున్నాడు. అందులో మొదటిది సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ బ్యానర్లో తెరకెక్కాల్సి ఉంది. ఆ చిత్రం ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉంది. కాని అజ్ఞాతవాసి ఫ్లాప్ అవ్వడంతో పాటు, ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అందుకే పవన్ సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ను పక్కకు పెట్టేయడం జరిగింది. నిన్న మొన్నటి వరకు పవన్ డేట్లు ఇస్తాడని ఎదురు చూసిన సంతోష్ శ్రీనివాస్తో తాజాగా క్లారిటీ వచ్చింది. పవన్ మేనేజర్ నుండి సంతోష్ శ్రీనివాస్కు కాల్ వచ్చిందని, ప్రస్తుతం పవన్ సినిమా చేసే పరిస్థితిలో లేడని, ఆయన పూర్తిగా రాజకీయాలతో బిజీ అవ్వాలనుకుంటున్నారు. అందుకే మీరు వేరే ప్రాజెక్ట్ను చూసుకోండి అంటూ సలహా ఇచ్చారట. దాంతో సంతోష్ శ్రీనివాస్ మరో హీరోను వెదికే పనిలో పడ్డాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ 2020 వరకు తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. ఒక వేళ పవన్ ఆశించిన ఫలితాలు 2019 ఎన్నికల్లో రాకుంటే మళ్లీ సినిమాలు మొదలు పెడతాడు. ఆ సినిమా 2020లో వస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.