ఆడియో వేడుకకు పవన్‌ రాబోతున్నాడు

Pawan Kalyan to attend Chal Mohan Ranga pre-release event

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
‘అజ్ఞాతవాసి’ తర్వాత పూర్తిగా రాజకీయాలకు అంకితం అయిన పవన్‌ కళ్యాణ్‌ చాలా రోజుల తర్వాత ఒక సినిమా కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న నితిన్‌ ‘చల్‌ మోహన్‌ రంగ’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. ఆ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంకు పవన్‌ హాజరు కాబోతున్నాడు. సహజంగా అయితే పవన్‌ ఇలాంటి కార్యక్రమాలకు హాజరు అయ్యేందుకు ఆసక్తి చూపించడు. స్వయంగా తాను నిర్మిస్తున్న సినిమా అవ్వడంతో పవన్‌ తప్పనిసరి పరిస్థితుల్లో రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను ఈనెల 25న నిర్వహించబోతున్నామని, ఆ కార్యక్రమానికి పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు అంటూ నితిన్‌ ట్వీట్‌ చేశాడు. కార్యక్రమం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా నితిన్‌ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయబోతున్నారు. రచయిత కృష్ణ చైతన్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటించింది. నితిన్‌కు ఈ చిత్రం 25వది కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి ఈచిత్రాన్ని నిర్మిస్తుండగా, పవన్‌, త్రివిక్రమ్‌లు భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు.