‘ఎన్టీఆర్‌’ కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు

Chandrababu and KCR to attend NTR Biopic movie opening

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేయబోతున్న ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ చిత్రం అతి త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రంకు ఒక నిర్మాతగా బాలయ్య కూడా వ్యవహరించడం ఈ చిత్రం ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. బాలయ్య చాలా ఆశలు, అంచనాలు పెట్టుకుని తీస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలను ఈనెల చివర్లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన బ్యాక్‌ గ్రౌండ్‌ వర్క్‌ కూడా జరుగుతుందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ చిత్రం ప్రారంభోత్సవంకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు మరియు కేసీఆర్‌లను బాలయ్య ఆహ్వానించబోతున్నాడు. తెలుగు దేశం అధినేత అయిన ఎన్టీఆర్‌ చిత్రం ప్రారంభోత్సవంకు తప్పకుండా చంద్రబాబు నాయుడు వస్తాడు. ఇక తాను గతంలో ఎన్టీఆర్‌ శిష్యుడిని అని చెప్పుకునే కేసీఆర్‌ కూడా తప్పకుండా చిత్రం ప్రారంభోత్సవంకు వస్తాడని సినీ వర్గాల వారు మరియు రాజకీయ వర్గాల వారు అంటున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈనెల 29న ఇద్దరు ముఖ్యమంత్రు చేతుల మీదుగా చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుంటుంది. రెగ్యులర్‌ షూటింగ్‌ జులై లేదా ఆగస్టు నుండి ప్రారంభం అవ్వనుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.